విలక్షణ సినిమాల డైరెక్టర్ క్రిష్కి పెళ్లి కుదిరింది. అల్లరి నరేష్, శర్వానంద్లతో క్రిష్ రూపొందించిన ‘గమ్యం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ ఇలా అన్నీ విభిన్నమైన చిత్రాలే తీశారాయన. తెలుగు సినీ రంగంలో క్రిష్ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అన్న గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నాడు. హైద్రాబాద్కి చెందిన డాక్టర్ శృతితో క్రిష్ పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. ఆగష్టులో పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టారనీ సమాచారమ్.
క్రిష్ – శృతిల మధ్య ప్రేమ చిగురించి అది ప్రేమగా మారిందన్న ఊహాగానాల్లో నిజం లేదుట. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని సమాచారమ్. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అనే ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాడు క్రిష్. ఈ సినిమా కోసం మొరాకోలో షూటింగ్ ఈ మద్యనే పూర్తి చేసుకుని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ మొదలుపెట్టారు.. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రియను ఎంచుకున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, శ్రియలపై ఫస్ట్ షూట్స్ చేశారు. ఈ సినిమా తరువాత క్రిష్ రామ్ చరణ్తో ఒక సినిమా చేయాల్సి ఉంది. చరణ్ కోసం ఒక స్టోరీని రెఢీగా పెట్టాడట క్రిష్. ఆ తరువాత వరుణ్తో చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ‘వరుణ్తో చేసిన ‘కంచె’ సినిమా విజయాన్ని సాధించింది.