అదరగొడుతున్న కబాలి హీరోయిన్!!

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలీ’ మూవీలో మెరిసిన రాధికా ఆప్టే.. ఆ సినిమా విడుదలకు ముందే వార్తల్లో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ఓ షార్ట్ ఫిల్మ్ ఆమెను న్యూస్ లో నిలిపింది. గతేడాది ‘అహల్య’ అనే షార్ట్ ఫిల్మ్ తో రాధికా నెటిజన్లు, సినీ ప్రియులను అలరించింది. సహజ నటనతో కట్టిపడేసే ఈ సుందరి మరో లఘు చిత్రంతో అదే ట్రెడిషన్ రిపీట్ చేసింది.

శిరీష్ కుందర్ రూపొందించిన ‘కృతి’లో నటనకు రాధికాను అంతా ప్రశంసిస్తున్నారు. ‘కృతి’లో రాధికాతో పాటూ మనోజ్ బాజ్ పేయ్, నేహా శర్మలు నటించారు. ఈ ఫిల్మ్ లో మనోజ్ దే లీడ్ రోల్. ‘సపన్’ అనే రచయితగా.. తాను సృష్టించిన పాత్రలు.. వాస్తవానికి మధ్య మానసికంగా నలిగిపోయే పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. నేహ శర్మ యాక్టింగ్ సైతం కట్టిపడేస్తోంది. మొత్తంగా శిరీష్ కుందర్ ప్రాజెక్ట్ లో ఈ ముగ్గురు టాలెంటెడ్ యాక్టర్స్ పోటాపోటీగా నటించారు.

విడుదలైన ఒక్కరోజులోనే థ్రిల్లర్ ‘కృతి’కి అనూహ్య స్పందన వచ్చింది. చూసినవాళ్లంతా ఈ షార్ట్ స్టోరీని ఆకాశానికెత్తేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ లతో పాటూ అనేకమంది కథ-కథానాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టోరీ చూస్తున్నంత సేపూ కూర్చీ అంచున కూర్చున్నానంటూ కరణ్ ట్వీట్ చేశారు.