విజయనగరంలో బాబు సత్తా..టీడీపీకి అవే ప్లస్.!

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే..ప్రతి జిల్లాలోనూ టీడీపీకి దెబ్బతగిలింది. కొన్ని జిల్లాల్లో ఇంకా దారుణమైన ఫలితాలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో దారుణంగా ఓడి ఒక్క సీటు కూడా గెలవలేదు. మామూలుగా సీమ బెల్టులో టీడీపీకి దారుణ ఓటమి వచ్చిన పార్టీ శ్రేణులు తీసుకున్నాయి గాని..పట్టున్న విజయనగరంలో కూడా ఒక్క సీటు కూడా తెచ్చుకోకపోవడం మింగుడు పడని విషయం. […]

అనంతలో చౌదరీకి సీటు కష్టాలు..!

అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అంతా అనుకుంటారు…అయితే ఒకప్పుడు అనంతలో టీడీపీకి కలిసొచ్చింది..కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారింది..అక్కడ వైసీపీ పాగా వేసింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే నిదానంగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం వలన టీడీపీకి కలిసొస్తుందని అనుకోవడానికి లేదు. వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో మాత్రం […]

త‌మ్ముళ్ల మ‌ధ్య గొడ‌వ పెట్టిన చంద్ర‌బాబు… త‌న్నుకుంటున్నారుగా…!

తాంబూలాలిచ్చేశాను.. త‌న్నుకు చావండి! అని క‌న్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నేత‌లు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీల‌క‌మైన డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబం ధించి.. నాయ‌కులు త‌న్నుకులాడుతున్నారు. డోన్ నియోజ‌క‌వ‌ర్గంపై కేఈ కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్రభాకర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని త‌పిస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియ‌మిం చారు. కొన్ని రోజుల కింద‌ట […]

తెలంగాణలో 30 సీట్లపై టీడీపీ ఆశలు..ఛాన్స్ ఉందా?

ఒకప్పుడు తెలంగాణ అంటే టీడీపీకి కంచుకోట అన్నట్లు ఉండేది. అక్కడ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది..కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బాగానే సీట్లు తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ గెలిచింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీని గట్టిగా దెబ్బతీశారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో..టీడీపీ పతన దశకు వచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని..కేవలం 2 […]

బొబ్బిలిలో సైకిల్ జోరు..30 ఏళ్ల తర్వాత ఛాన్స్.!

ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 వరకు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా గెలిచిన సందర్భాలు తక్కువ. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే టీడీపీ అక్కడ గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక ఎప్పుడో 1994లో గెలిచిన టీడీపీకి మళ్ళీ 2024 […]

బాలయ్యతో పవన్..అసలు గేమ్ మొదలైందా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళుతున్నాయి. పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు గాని..చంద్రబాబు-పవన్ మాత్రం పరోక్షంగా పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఈ పొత్తు అంశాన్ని ఎన్నికల ముందే తేలుస్తారని తెలుస్తోంది. అంటే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే బాబు వెళ్ళి పవన్‌ని […]

జనసేనతో పొత్తు..తెనాలి సీటు నాదెండ్లకే..ఆలపాటి క్లారిటీ.!

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై కొంతమంది తెలుగు తమ్ముళ్ళకు నిదానంగా క్లారిటీ వస్తుంది. పొత్తు ఉంటేనే గట్టెక్కుతామనే భావన..అటు టీడీపీలోగానీ, ఇటు జనసేనలో గాని ఉందని చెప్పవచ్చు. పొత్తు లేకపోతే ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీకే లబ్ది జరిగేలా ఉంది. అందుకే పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అంటున్నారు. ఇటు చంద్రబాబు కలిసి పనిచేద్దామని అంటున్నారు. మొత్తానికి అధికారికంగా పొత్తు విషయం క్లారిటీ లేదు గాని..అనధికారంగా చంద్రబాబు-పవన్ కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారని అర్ధమవుతుంది. […]

టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన కీల‌క ఎన్నిక‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. ఇది ప్ర‌త్య‌క్షంగా కాదు.. ప‌రోక్షంగానే! అయినా కూడా.. భారీ దెబ్బేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఏపీలో స‌చివాల‌య ఉద్యోగుల సంఘం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఫలితాలు.. తాజాగా విడుద‌ల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వెంక‌ట్రామిరెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈయ‌న‌కు వైసీపీ సానుభూతిప‌రుడుగా పేరుంది. పైగా.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాకుచెందిన వ్య‌క్తి. అంతేకాదు.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీప్ర‌భుత్వాన్ని ప్ర‌శంస‌ల‌తో నింపేసేవారు. సో.. ఈయ‌న […]

టీడీపీలోకి వసంత..దేవినేనికి అదే టెన్షన్.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. అదే సమయంలో రెండు పార్టీల్లో అంతర్గత యుద్ధం కూడా నడుస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..మంత్రి జోగి రమేష్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అటు టీడీపీలో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుల మధ్య పోరు నడుస్తోంది. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి..వచ్చే ఎన్నికల్లో తన సొంత స్థానమైన మైలవరం […]