ట్రైలర్‏కు ముందు `పుష్ప`రాజ్ టీజ్ అదిరిపోయిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. […]