మునుగోడులో రసవత్తరంగా త్రిముఖ పోటీ

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. త్రిముఖ పోటీ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో 2022లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి.. టికెట్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన చల్లమల కృష్ణారెడ్డి.. బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల […]

హాట్‌ టాపిక్‌గా మునుగోడు నియోజకవర్గం

పోగొట్టుకున్న చోటే తిరిగి అధికారం చేజిక్కించు కోవాలనుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. మరోసారి కాంగ్రెస్ గూటికి చేరారు. రాజగోపాల్‌ రెడ్డి రీ ఎంట్రీతో నల్గొండ జిల్లాలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం గత ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. గత 2018 ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన […]