ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జగన్ సర్కార్ రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లోకి జమ చేయనుంది. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని తాడేపల్లిలోని క్యాంపు […]
Category: Politics
సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం..కరోనాతో పెద్ద కుమారుడు మృతి!
కంటికి కనిపించకుండా ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులనే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా సీపీఎం సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకగా.. […]
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కిషన్రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుది శ్వాస్ విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. మరోవైపు పలువురు బీజేపీ నాయకులు యాదగిరి రెడ్డి మృతిపై సంతాపం వ్యాక్తం చేస్తున్నారు. […]
నేటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్..ఎప్పటి వరకంటే?
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. తగ్గినట్టే తగ్గిన కరోనా సెకెండ్ వేవ్లో విశ్వరూపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.. ఈ మహమ్మారి వారు, వీరు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ […]
భారత్ ఘనత.. ఐరాస కీలక కమిటీల్లో సభ్యత్వం..!
భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి మరింతగా పెరిగింది. అరుదైన అవకాశాన్ని, గుర్తింపును పొందింది. ఐక్యరాజ్య సమితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యత్వాన్ని సాధించింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే […]
నారాలోకేష్ను వైరస్ అంటూ వర్మ ట్వీట్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. ఆ సారి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుంది.. ఈ వైరస్ ప్రాణాంతకమైనది అని వ్యాఖ్యానించిన వర్మ.. ఆ […]
కరోనా బారిన పడ్డ రాహుల్ గాంధీ!
మునుపటితో పోలిస్తే ప్రస్తుతం కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల పైనే కాకుండా.. సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇటీవల తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ టెస్ట్లు […]
చంద్రబాబు బర్త్డే..చిరు స్పెషల్ విషెస్!
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇక చంద్రబాబు బర్త్డే సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు […]
బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ సీఎంకు కరోనా పాజిటివ్..!
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏవిధంగా ఉగ్రరూపం దాలుస్తుం దో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కరోనా వైరస్ రోజు రోజుకి దేశంలో తన ఉద్రితిని కొనసాగిస్తూ ఉంది. రోజుకి సరాసరి రెండు లక్షలకు కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. సీఎం చంద్రశేఖర రావుకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో […]









