టాలీవుడ్లో విలన్గా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ వరుస ప్లాపుల తర్వాత లౌక్యం సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి ఎక్కాడు. లౌక్యంతో గోపీకి వచ్చిన పేరంతా సౌఖ్యం సినిమాతో పోయింది. సౌఖ్యం తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీ ఒకేసారి మూడు సినిమాల్లో నటించాడు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఆరడగుల బుల్లెట్ పలుసార్లు వాయిదాలు పడి గత నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది.
ఇక ఆక్సిజన్ సినిమాది అదే దారి. ఈ రెండు సినిమాల సంగతి ఎలా ఉన్నా మాస్ డైరెక్టర్ సంపత్నంది డైరెక్షన్లో గోపీ చేసిన గౌతమ్నంద సినిమా టీజర్, ట్రైలర్లు రిలీజ్ అయ్యాక సినిమాకు మంచి హైప్ వచ్చింది. సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కడంతో ప్రివ్యూలు చూశాక అటు గోపీచంద్, డైరెక్టర్ సంపత్నంది ఫుల్ కాన్పిడెన్స్తో ఉన్నారు. వీరి కాన్ఫిడెన్స్ చూసిన సినీజనాలు కూడా సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు.
గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన గౌతమ్నంద తొలి రోజు వరకు వసూళ్ల పరంగా ఓకే అనిపించింది. తొలి వారంతంతో పాటు మిగిలిన వీక్ డేస్లో బాగా తేలిపోయింది. దీంతో గౌతమ్నంద ఆడుతున్న థియేటర్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఈ సినిమాకు రూ. 25 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా, లాంగ్ రన్లో రూ. 10 కోట్ల షేర్ వస్తే గొప్పని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ఇక ఈ లెక్కన చూస్తే రిలీజ్కు రెడీగా ఉన్న గోపీ సినిమాలు ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్ రెండూ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి.
ఓవరాల్గా ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో వినపడుతోన్న టాక్ ప్రకారం గోపీచంద్కు సరైన హిట్ ఇప్పట్లో పడే ఛాన్సులు లేవు. రిలీజ్కు రెడీగా ఉన్న రెండు సినిమాపై అంచనాలు లేవు. ఏదైనా గోపీ ఓ బ్లాక్బస్టర్ హిట్ ఇస్తే తప్ప అతడి ఫ్యూచర్ నిల్ అన్న చర్చలు నడుస్తున్నాయి.