టాలీవుడ్లో కమెడియన్ రేంజ్ నుంచి ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యుసర్గా మారిపోయాడు బండ్ల గణేష్. కామెడియన్గా ఉండే బండ్ల ఒక్కసారిగా అంత పెద్ద ప్రొడ్యుసర్ ఎలా అయిపోయాడో ఇప్పటకీ చాలా మందికి అర్థం కాదు. తర్వాత కూడా బండ్ల చాలాసార్లు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక హీరో సచిన్ జోషికి బండ్లకు కొద్ది రోజులుగా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సచిన్ జోషి బండ్ల గణేష్ను మరోసారి దారుణంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేశాడు.
తాను ఎన్టీఆర్, చరణ్లతో సినిమాలు తీస్తున్నానని చెప్పి తన దగ్గర కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకున్నాడని..ఆ తర్వాత ఆ అప్పులు ఎగ్గొట్టాడని సచిన్ చెప్పాడు. బండ్ల తనకు ఇచ్చి ప్రామీసరి నోట్ల ఆధారంగా తాను కోర్టులో 14 కేసులు వేశానని… అయితే బండ్ల గణేష్ వాళ్ళ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే అప్పటికి క్షమించాల్సి వచ్చిందని చెప్పాడు సచిన్ జోషి.
ఇక వీళ్లిద్దరి గొడవలోకి ఎన్టీఆర్ను కూడా లాగేశాడు సచిన్జోషి… ఓ సారి బండ్ల గణేష్తో కలిసి సచిన్ జోషి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాడట. బండ్ల గణేష్ని చూసిన ఎన్టీఆర్…సచిన్తో….‘వాడ్ని ఎందుకు తీసుకొచ్చావ్….వాడ్ని లోపలకు తీసుకురాకు….’ అని చెప్పాడట ఎన్టీఆర్.
బండ్ల గణేష్ను ఎన్టీఆర్ కనీసం గడపకూడా తొక్కనీయలేదంటే ఎన్టీఆర్కు గణేష్పై ఉన్న అభిప్రాయం ఏంటో తెలుస్తుందని బండ్లపై తీవ్రస్థాయిలో సచిన్ ధ్వజమెత్తాడు. ఇక బండ్ల గణేష్ కూడా గతంలో ఎన్టీఆర్ విషయంలో తాను చెప్పుడు మాటలు విని ఆయన్ను అపార్థం చేసుకున్నానని…ఎన్టీఆర్తో పాటు ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన సంగతి తెలిసిందే.