సలార్ రివ్యూ.. ప్రభాస్ ర్యాంపేజ్ షురు.. ఇక గూస్ బంప్స్ మోత మోగాల్సిందే..

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత రెండు ఏళ్ల నుంచి ప్రభాస్ సలార్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. కే జి ఎఫ్ సిరీస్ లతో ఇండస్ట్రియల్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్‌, ప్రభాస్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజిఎఫ్ సిరీస్ ప్రొడ్యూసర్ విజయకిరంగదూర్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం.. శృతిహాసన్ హీరోయిన్గా, కన్నడ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారాన్‌ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై మరింత హైప్‌ పెరిగింది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైల‌ర్, రెండు సాంగ్స్‌తో భారీ వ్యూస్ ద‌క్కించుకొని రికార్డులు సృష్టించింది. ఇక‌ సలార్ ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల భారీ టార్గెట్ ను రిచ్ అవ్వాల్సి ఉంది. ఈ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ ఢంకీ కూడా ఈరోజు రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటికే సినిమా మిడ్ నైట్ షో పూర్తయింది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా సలార్ ప్రభాస్ రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకుందో లేదో చూద్దాం. చిన్నపిల్లల మధ్య ఫ్రెండ్షిప్స్ సీన్స్ తో మొదలై తర్వాత సూర్యుడే గొడుగు పట్టి సాంగ్ వచ్చింది. దాదాపు 15 నిమిషాలకు ప్రభాస్ సింపుల్ ఎంట్రీ.. దీనికి ఫ్యాన్స్ బ్రహ్మ రథం పట్టారు.

మొదటి 45 నిమిషాలు మిస్టరీ ఎలిమెంట్ తో సినిమా రన్ అయింది. ఆ మిస్టరీ అంతా శృతిహాసన్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఫ్రీ ఇంటర్వెల్ ముందు వరకు ప్రశాంతంగా సాగిన మూవీ త‌ర్వాత‌ నుంచి మోస్ట్ వైలెంట్ గా మారిపోయింది. ఇంటర్వెల్ కి ముందు పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఎంట్రీ.. ఇక్కడి నుంచి స్టోరి రూంజ్ మొత్తం మారిపోయింది. ఎన్నో ట్విస్టులతో ఆడియన్స్ ఒక్కసారిగా సీట్ ఏడ్జ్‌కి వచ్చే అంతా ఉత్కంట‌గా సాగాయి. యాక్షన్ ఎపిసోడ్‌లు అయితే ప్రభాస్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.

 

దాదాపు 20 నిమిషాల వరకు థియేటర్ అదిరిపోయాయి. ప్రశాంత్ నీల్ కరెక్ట్ టైం లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే లెవెల్ లో ఎలిమెంట్స్ ను ప్లాన్ చేశాడు. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ఒక మాన్స్టర్‌ల‌ అనిపించాడు. అయితే అక్కడక్కడ మాత్రం కాస్త కేజిఎఫ్ వాసనలు తగిలాయి. ఇదొక్కటే సినిమాలో మైనస్ గా చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ లో సాగింది. సెకండ్ హాఫ్ లో ఒక ట్రైబల్ గర్ల్ ని కాపాడే యాక్షన్ ఎపిసోడ్ ని ప్రశాంత్ గూస్‌బంప్స్ వ‌చ్చేలా ప్లాన్ చేశాడు. సెకండ్ హాఫ్ లెంతి అనిపించినా.. ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగానే ఎలిమెంట్స్ ఉన్నాయి.

క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. కొన్నిచోట్ల డ్రామా ల్యాగ్‌ అనిపించినా ఈశ్వరి రావ్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ప్రభాస్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్‌ సినిమాలో ప్ర‌భాస్‌ని బాగా వాడేశాడు. యాక్షన్ సన్నివేశాల ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాయి. డైలాగులు కూడా పర్ఫెక్ట్ గా అనిపించాయి. సెకండ్ హాఫ్ లో స్టోరీ రసవ‌త్త‌రంగా సాగింది. కాన్‌స‌ర్‌లో రక్తం ఏరులై పారింది.. ఓవరాల్గా సలార్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ హిట్ పడింది.