మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న 3 ముళ్ళు బంధంతో ఒకటైన సంగతి మనకి తెలిసిందే. కొద్దికాలంగా గుట్టుచప్పుడు కాకుండా వీరిద్దరూ ప్రేమాయణం నడిపి.. అనంతరం పెద్దలు ఒప్పందంతో వివాహం చేసుకున్నారు. ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహానికి మెగా కుటుంబం, అల్లు ఫ్యామిలీ, వీరి స్నేహితులు హాజరయ్యారు. ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు ఇచ్చారంటూ కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై తాజాగా వరుణ్ టీమ్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.
” వరుణ్, లావణ్య వివాహం ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లు అన్ని అబద్ధం. ఇలాంటి రూమర్స్ నమ్మి, ప్రచారం చేయవద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ” అంటూ వరుణ్ టీం ట్వీట్ చేశారు. తద్వారా వీరి పెళ్లి ఓటీటీ రైట్స్ రూ.10 కోట్లకు నెట్ఫ్లిక్స్ పొందడం అనేది పచ్చి అబద్ధం అని వెల్లడయింది. ప్రస్తుతం వీరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The ongoing speculations around the OTT rights of #VarunTej & #LavanyaTripathi‘s wedding are completely baseless and untrue.
Requesting everyone not to believe in such rumours and spread them.
– Team #VarunTej pic.twitter.com/khuGcVQvq8
— Team VarunTej (@TeamVarunTej) November 7, 2023