సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ నయనతార.. గత ఏడాది ఓ ఇంటికి అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు వేసింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషన్ అయింది.
కోర్టులు, కేసులు అంటూ నానా రచ్చ జరిగింది. ఫైనల్ గా అన్నిటిని వదిలించుకుని నయనతర భర్త, కుమారులతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. మరోవైపు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రాణిస్తోంది. అయితే తాజాగా వీరు కేరళ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.
భర్త, ఇద్దరు కుమారులతో నయనతార అరటి ఆకులో భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. `మా లైఫ్ లో అందమైన, అద్భుమైన క్షణాలివి.. ఉయిర్, ఉలగంతో మొదటి సారి ఓనమ్ పండుగను జరుపుకుంటున్నాము` అంటూ విశ్నేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు నయన్ దంపతులు తమ కుమారుల ఫేస్ను చూపించలేదు. తాజా ఫోటోల్లో కూడా వెనక నుంచి తీసిన ఫోటోలనే విఘ్నేష్ షేర్ చేశారు. అయినప్పటికీ నయన్ ఫ్యాన్స్ బుడ్డొళ్లు ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫేస్లు ఎప్పుడు చూపిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram