చేపలు పడుతున్న నాగచైతన్య.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ‘ఎమాయ చేసావె ‘  సినిమా లో హీరోగా నటించాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలో నటించిన నాగచైతన్య తన నటనతో ఎంతోమంది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తండ్రికి వచ్చినంత ఫేమ్ మాత్రం చైతన్య కి రాలేదు. ప్రస్తుతం నాగచైతన్య మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకోడానికి శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.

చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా మత్స్య కారుల జీవిత నేపథ్యంలో రూపొందుతుంది. కాబట్టి ఈ సినిమా కోసం చిత్ర బృందం మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకోడానికి కసరత్తులు చేస్తోంది.

గురువారం రోజు నాగచైతన్య, దర్శకుడు చందు, బన్నీ వాసు శ్రీకాకుళం లోని మత్స్యకారులని కలిసి వారి జీవనశైలి, సంస్కృతిని అడిగి తెలుసుకున్నారు. అలానే శుక్రవారం రోజు వైజాగ్ పోర్టును సందర్శించారు. అందరూ కలిసి మత్స్యకారులతో కలిసి చేపల వేటకు కూడా వెళ్లారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే సమయం లి సముద్ర ప్రయాణం, వేట, అక్కడ ఎదురయ్యే పరిస్థితులన్నిటి గురించి అడిగి తెలుసుకున్నారు.