వయసులో తనకంటే 30 ఏళ్ల పెద్దవాడైన బాలీవుడ్ డైరక్టర్ శేఖర్ కపూర్ ని వివాహం చేసుకుంది ప్రముఖ నటి, సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి. ఇక వీరి వివాహం 1999లో జరిగింది. ఇక వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్లి తరువాత తన భర్త కోరిక మేరకు నటనకు దూరం అయింది సుచిత్ర కృష్ణమూర్తి. కానీ కొన్ని కారణాల వల్ల 2007లో వీరు విడిపోయారు. అయితే తమ విడాకులకు హీరోయిన్ ప్రీతి జింటా కారణమని.. మా దంపతులకు ఆమె చిచ్చు పెట్టిందని బహిరంగంగా ఆరోపించింది సుచిత్ర.
ఇకపోతే సుచిత్ర చేసిన కామెంట్స్ వైరల్ కాగా.. వాటిపై హీరోయిన్ ప్రీతిజింటా స్పందించి.. నేను సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్నాను. సుచిత్ర కనీసం నటించడం కూడా లేదు. ఆమె ఒక హౌస్ వైఫ్.. ఇంటికి మాత్రమే పరిమితమైంది.. నా గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదు.. ఆమెను చూస్తుంటే మానసిక స్థితి సరిగ్గా లేదని అనిపిస్తోంది.. ముందుగా తనని మానసిక డాక్టర్ కి చూపించడం మంచిది అంటూ కౌంటర్ ఇచ్చింది.
గతంలో ప్రీతి జింటాతో జరిగిన ఈ మాటల యుద్ధం పై సుచిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు..నేను ఒక ఇల్లాలిని.. అందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను.. అంతే కాకుండా ఒక బిడ్డకు తల్లిని కూడా అంటూ సుచిత్ర మాట్లాడింది.. అయితే నేను ప్రీతి జింటాను ఎప్పటికీ క్షమించను.. తను ఉందా లేదా అన్న విషయం కూడా పట్టించుకోను అని అన్నారు.
సుచిత్ర మలయాళం లో పలు సినిమాలు చేసింది అంతేకాకుండా సుచిత్ర మంచి గాయని కూడా.. అంతే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి పేరును కూడా సంపాదించుకుంది. ఏదేమైనా ప్రీతిజింటా పై ఇలాంటి ఆరోపణలు చేయటంతో ఇవి కాస్తా వైరల్ గా మారుతున్నాయి.