హీరో బాలకృష్ణ ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా బాలయ్య మాస్ హీరోగా డబల్ యాక్షన్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఒక రికార్డును సైతం క్రియేట్ చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలు 100 రోజులు 150 రోజులు 175 రోజులు 200 రోజులు వంటివి పలు రికార్డులు సృష్టిస్తూ ఉండేవి.. కానీ ఈ మధ్యకాలంలో కేవలం సినిమా వచ్చిన నెలలోపే ఓటీటి లో రావడం వల్ల కలెక్షన్లు రాబట్ట లేకపోతున్నాయి. దీంతో నెలలోపే ఓటీటి లోకి పలు చిత్రాలు వచ్చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలోనే బాలయ్య నటించిన సినిమా సిల్వర్ జూబ్లీ ఆడడం అంటే అదొక రికార్డ్ అని చెప్పవచ్చు. వీరసింహారెడ్డి చిత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆలూరు లో శ్రీ లక్ష్మీనరసింహ థియేటర్లో రోజుకి నాలుగు ఆటలతో జులై 5న 175 రోజులు పూర్తి చేసుకున్నది. వారం రెండు వారాలకి ఎంతో సక్సెస్ అయిన సినిమాలను తీసేస్తున్న సమయంలోనే ఇన్ని రోజులు ఒకే థియేటర్లో సినిమా ఆడడం అంటే అది ఒక రికార్డు అని చెప్పవచ్చు. బాలయ్య నటించిన అఖండ సినిమా కూడా 175 రోజులు ఆడడం గమనార్హం.
ఇలా చెప్పుకుంటూ పోతే రెండు సిల్వర్ జూబ్లీ సినిమాలు అది కూడా రియల్ రోజులు చేసిన సినిమాలు 175 రోజులు ఆడడం కేవలం ఒక బాలయ్య వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. మరి ఇదే ఉత్సాహంతో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రం కూడా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి తెరకెక్కిస్తున్నారు ఇందులో కూడా బాలయ్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.