తెలుగు సినీ పరిశ్రమలో కొన్నిసార్లు జరిగిన సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో గుర్తుండిపోయేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎంతోమంది నటీనటులు మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇలాంటి మిస్టరీగా ఉన్నటువంటి వాటిలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు కూడా ఒకటని చెప్పవచ్చు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం బాలకృష్ణ ఇంట్లో సురేష్ బాబు జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిల పైన పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే ఇలా కాల్పులు జరిగిన సమయంలో బాలకృష్ణ వీరి పైన కాల్పులు జరపడానికి కారణం ఏంటనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ఈ సంఘటన జరిగి 20 సంవత్సరాల అవుతున్న ఈ ఘటన జరిగిందన్న విషయం గురించి ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.. తాజాగా బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి పలు విషయాలను తెలిపారు.
బెల్లంకొండ గణేష్ నటించిన తాజా చిత్రం స్టూడెంట్ సర్.. ఈ సినిమా జూన్ రెండవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన గురించి మాట్లాడుతూ..ఈ కాల్పులు జరిగినప్పుడు తనకు పదహారేళ్ళ వయసు కూడా లేదని ఈ ఘటన ఎందుకు జరిగింది ఏంటనే సంఘటన మాత్రం గుర్తు లేదని ఈ సంఘటన గురించి తన ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడు కూడా తన తండ్రిని అడిగే ప్రయత్నం చేయలేదని.. ఒకవేళ అలా అడిగి తెలుసుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదని బెల్లంకొండ గణేష్ తెలియజేశారు.