కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కే జి ఎఫ్ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోగ యష్ అద్భుతమైన నటన ను ప్రదర్శించారు. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మొదటి భాగం రెండవ భాగం కూడా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియాలే వల్ల అంతటి తీరు సంపాదించిన సినిమా కేవలం కేజిఎఫ్ చిత్రానికె దక్కింది.
కే జి ఎఫ్ పార్ట్-2 సినిమా ముగిస్తూ పార్ట్ 3 కూడా ఉంటుందని హింట్ ఇవ్వడం జరిగింది. కే జి ఎఫ్ -2 లో మాత్రం హీరో పాత్ర ఎండ్ చేసినట్లు చూపించిన ప్రశాంత నీల్ థర్డ్ పార్ట్ ఎలా తీస్తాడు అన్న ఆసక్తి అభిమానులలో చాలా నెలకొంది. కే జి ఎఫ్-3 పై ఆ సినిమాలో నటించిన రవీనా టాండన్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. సినిమాలో రమికాసేన్ గా నటించి అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కే జి ఎఫ్-3 కూడా ఎప్పుడు మొదలవుతుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. మళ్ళీ చిత్ర బృందంతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని తెలుపుతోంది రవినా టాండన్.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె బుల్లితెర మీద మహిళ ప్రాధాన్యత పెరగడం గురించి తెలియజేసింది. బుల్లితెరపై పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. సీరియల్స్ లో కూడా మహిళలే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఓటీటీ లో కూడా మహిళలు తమ హవా కొనసాగిస్తున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయమని తెలిపింది . గతంలో హీరోయిన్గా బాలీవుడ్లో రాణించిన ఈమె ఈమధ్య కాలంలో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది.