తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది క్యూట్ కపుల్ ఉన్నారని అనడంలో సందేహం లేదు. వారిలో రామ్ చరణ్, ఉపాసన కామినేని ముందు వరసలో ఉంటారు. ఈ ముచ్చటైన జంట త్వరలోనే తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల, ఈ స్టార్ కపుల్ తమ కుటుంబం, కొంతమంది సన్నిహితులతో కలిసి దుబాయ్లో బేబీ షవర్ వేడుక జరిపించారు. ఆ తర్వాత, రామ్ చరణ్ తిరిగి పనిలోకి రాకముందే వారు చిన్న వెకేషన్ తీసుకొని మాల్దీవులకు వెళ్లారు.
తాజాగా తిరిగి వచ్చిన వారిని పెంపుడు కుక్క రైమ్ ఎయిర్పోర్ట్కి వచ్చి సర్ప్రైజ్ చేసింది. రామ్ చరణ్, ఉపాసన తరచుగా బయటికి వెళ్ళేటప్పుడు తమతో పాటు రైమ్ని తీసుకువస్తారు. అయితే, ఈ ప్రత్యేకమైన వెకేషన్ కోసం, రైమ్ రామ్ చరణ్ కుటుంబంతో కలిసి హైదరాబాద్లోనే ఉంది. అంటే అది వాళ్లతో కలిసి వెళ్లలేదు. ఎప్పుడూ వారితో నేను వెళ్తే ఎంజాయ్ చేసేవి కుక్క ఈసారి మాత్రం బిక్కటిల్లింది. అయితే వారి మీద ప్రేమ ఆబట్టుకోలేక అది వారు వస్తున్నారని తెలిసి విమానాశ్రయానికి కూడా వచ్చేసింది.
తమ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రామ్ చరణ్, ఉపాసన విమానాశ్రయంలో రైమ్ను చూసి ఆశ్చర్యపోయారు. వీరి కలయికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామ్ చరణ్ రైమ్ని తన చేతుల్లోకి ఎత్తుకుని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లాడు. దాన్ని ముద్దు పెట్టుకుంటూ తన ప్రేమను కురిపించాడు. ఆ కుక్క కూడా చరణ్ మూతి నాకుతూ తన ప్రేమను వ్యక్తపరిచింది. ఈ దృశ్యాలను చూసి చెర్రీ సతీమణి ఉపాసన ఫిదా అయిపోయింది. ఆమె ముఖంపై చిరునవ్వులు చిందాయి. ఈ దృశ్యాలన్నీ చూసేందుకు మనసును హత్తుకునేలా అనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ అయింది.
View this post on Instagram
రామ్ చరణ్ దర్శకుడు ఎస్ శంకర్తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ, అంజలితో కలిసి నటించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో కూడా రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు!