సాధారణంగా కొందరు హీరోలు తెరపైనే కాదు నిజజీవితంలోనూ గొప్ప మనసు చాటుకుంటారు. రియల్ హీరోలుగా నిరూపించుకుంటారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమైన చరణ్.. తాజాగా ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తొమ్మిదేళ్ళ మణి కుశాల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. స్పర్శ్ హాస్పిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణి కుశాల్ కు రామ్ చరణ్ అంటే వీరాభిమానం. ఈ నేపథ్యంలోనే తన ఫెవరేట్ హీరోను చూడాలని ఆ చిన్నారి ఆశ పడ్డాడు. తన మనసులో కోరికను వెల్లడించగా.. ఆ విషయాన్ని `మేక్ ఏ విష్ ఫౌండేషన్` ద్వారా తెలుసుకున్నాడు చరణ్.
అయితే షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ.. వీలు చేసుకుని గురువారం మధ్యాహ్నం మణి కుశాల్ దగ్గరకు వెళ్ళారు. అతడిలో ధైర్యాన్ని నింపడంతో పాటు ఓ గిఫ్ట్ ను కూడా ఇచ్చారు. హాస్పటల్ లో సదరు చిన్నారితో కొంత సమయాన్ని స్పెండ్ చేశారు. ఇక తన అభిమాన హీరోను చూసి మణి కుశాల్ ఆనందం రెట్టింపు ఆయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసి నెటిజన్లు చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `ఆర్సీ 15` మూవీ చేస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంటే.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Through #MakeaWishFoundation our #ManOfMasses Mega Power Star @AlwaysRamCharan garu met a 9yr old kid ailing from cancer. The kid’s wish of meeting his favourite star was fulfilled with the actor spending quality time with him. #ManOfMassesRamCharan #Ramcharan pic.twitter.com/vAPMAl9VdV
— SivaCherry (@sivacherry9) February 9, 2023