సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్సు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో కమెడియన్ పృథ్విరాజ్ కూడా ఒకరు. గతంలో ఎన్నో సినిమాలలో నటించిన ఈ నటుడు ఈ మధ్యకాలంలో పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం వల్ల పలు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు. ఇక పృథ్వీరాజ్ తన కూతురిని హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేశారు టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గా మంచి పాపులారిటీ సంపాదించారు.
తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తూ పృథ్వీరాజ్ ఇప్పుడు తన కూతురిని హీరోయిన్గా పరిచయం చేయబోతున్నారు. పృథ్విరాజ్ కూతురు అసలు పేరు శ్రీలు. ఈమెను హీరోయిన్గా పరిచయం చేస్తున్న సినిమాకు స్వయంగా పృథ్వినే దర్శకత్వం వహిస్తున్నారు. పృధ్వీరాజ్ దర్శకత్వంలో వస్తున్న మొదటి చిత్రం కొత్త రంగుల ప్రపంచం. ఈ చిత్రాన్ని క్రాంతి కృష్ణ హీరోగా నటిస్తున్నారు.
శ్రీ పి ఆర్ క్రియేషన్ బ్యానర్ పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి ,కృష్ణారెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ చిత్ర బంధం విడుదల చేసింది కానీ పృథ్వీరాజ్ కూతురు శ్రీలు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఈమె అందానికి సైతం కుర్రకారులు మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. పృథ్విరాజ్ పలు రకాలుగా ట్రోల్ కి కూడా గురవుతున్నారు. అభిమానులు మాత్రం రాజకీయాలు వదిలేసి సినిమాలలో నటిస్తే కెరియర్ బాగుంటుందని సూచిస్తున్నారు. మరి పృధ్విరాజ్ దర్శకుడుగా సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.