టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య, వీరాసింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయంగా నిలిచాయి. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి,బాలయ్య ఇలా సంక్రాంతికి పోటీపడి తమ సినిమాలను విడుదల చేశారు. ఇక వీర సింహారెడ్డి సినిమా విషయానికొస్తే కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు.డైరెక్టర్ గోపీచంద్ మలినేని.
ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పాత్రలో నటించింది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ హనీ రోజ్ కూడా నటించారు. ఇటీవల కాలంలో వరలక్ష్మి టాలీవుడ్ లో పలు అవకాశాలను సైతం అందుకుంటోంది.
హీరోయిన్ గా కంటే ఈమె నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలలోనే నటిస్తూ బాగా అదరగొట్టేస్తోంది. ఇక బాలయ్య సినిమాలో కూడా ఇదే తరహాలో పాత్రను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కోసం వరలక్ష్మి అందుకున్న రెమ్యూనరేషన్ కేవలం రూ.50 లక్షల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది.
అలాగే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన కనడ నటుడు దునియా విజయ్ కూడా ఈ సినిమా కోసం రూ.1.2 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ సినిమా కోసం రూ.2.5 కోట్ల రూపాయలు తీసుకున్నదట. మరొక హీరోయిన్ హనీ రోజు కూడా కోటి రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇక బాలయ్య మాత్రం ఈ సినిమా కోసం దాదాపుగా రూ.18 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగా దూసుకుపోతోంది.