చిరంజీవి గురించి ట్వీట్ చేసిన మోహన్ బాబు..!!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మరియు మంచు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలకి మంచి బ్రాండ్ ఉంది. అయితే వీరిద్దరూ బయట కలిసినప్పుడు మా ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేం మంచి స్నేహితులం అంటూ చెప్పుకున్న ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉన్న టైంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మోహన్ బాబు ఒక ట్విట్ చేయడం జరిగింది.

Chiranjeevi, Mohan Babu on a weekend getaway to Sikkim. See pic - Hindustan  Timesచిరంజీవి టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిలిం హిస్టరీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.చిరంజీవి విషయానికొస్తే1980,90 శతకంలో తన నటనతో, డైలాగ్స్, డ్యాన్స్ లతో ఒక ఊపు ఊపేశారు.. అలా చిరంజీవి ఏన్నో సినిమాలను చేస్తూ విజయాలను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఆయనని గౌరవిస్తూ ఎన్నో అవార్డులు ఆయన చెంత చేరాయి. రీసెంట్ గా చిరంజీవికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అరుదైన గౌరవం ప్రకటించింది.

Mohan babu chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం.. ప్రశంసల వర్షం  కురిపించిన మంచు ఫ్యామిలీ

చిరంజీవికి ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అనే అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ఇదివరకు చాలామంది అందుకున్నారు. రజిని, ఇళయరాజా, అమితాబ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది అవార్డు చిరంజీవికి దక్కింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని సత్కరించనుంది. ఇక దేశవ్యాప్తంగా సెలబ్రిటీల నుండి చిరంజీవికి శుభాకాంక్షలు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ట్విట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించారు. నా ప్రియమైన స్నేహితుడికి గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇలాంటి సత్కారం నా ఫ్రెండ్ కు లభించబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అని మోహన్ బాబు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. అలాగె మోహన్ బాబు కొడుకు విష్ణు కూడా చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కటం చాలా సంతోషంగా ఉంది. మనకే కాదు ఫిలిం ఇండస్ట్రీకి గర్వంగా ఉంది అంటూ ట్విట్ లో పోస్ట్ చేశారు. మరి చిరంజీవి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.