తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక సమంత ఆరోగ్యం పైన గత కొద్దిరోజులుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సమంత విదేశాలలో వైద్య చికిత్స తీసుకుంటోందని ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే. సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం నిజమేనని తెలియజేసింది. తాజాగా ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసి స్పష్టతనిచ్చింది. ఇక అలాగే ఆసుపత్రి నుంచి ఆమె యశోద పై మీ అభిమానానికి థాంక్స్ అంటూ తెలియజేస్తూ ఉంది సమంత.
ప్రస్తుతం యశోద సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ లభించింది. తన పైన ఉన్న అభిమానులను చూసి సమంత తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఇలా ప్రస్తావించింది. గత కొద్ది రోజులుగా తను ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నానని.. దానిని మయోసటైజ్ గా పరిగణిస్తారని ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్నానని తెలియజేసింది. మొదట అనుకున్నంత వేగంగా చికిత్స పూర్తి అయ్యేలా కనిపించడం లేదని సమంత తెలియజేసింది వైద్యులు తనకు మంచి వైద్యాన్ని అందిస్తున్నారని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానని తెలియజేసింది సమంత. ఈ విషయం తెలియగానే అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ప్రస్తుతం సమంత సినిమాల విషయానికి వస్తే యశోద శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలలో నటించింది. ఇక త్వరలోనే యశోద శాకుంతలం సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఖుషి సినిమా ఇంకా ప్రస్తుతం షూటింగ్ జరుగుతూ ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే సమంతకి ఇలాంటి వ్యాదిన బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.
— Samantha (@Samanthaprabhu2) October 29, 2022