24 ఏళ్ల అమ్మాయితో నటుడు పృథ్వీ పెళ్లి నిజమేనా? ఇదుగో క్లారిటీ వచ్చేసింది!

నిన్న మొన్నటినుండి నటుడు పృథ్వీరాజ్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో గుప్పుగుప్పుప్పున ఊపందుకున్నాయి. ఈ తరుణంలో నెటిజన్లు ఈ వార్తను కొట్టి పడేసారు. అవును, 56 సంవత్సరాల వయస్సు గల పృథ్వీరాజ్ 24 ఏళ్ల అమ్మాయిని పెళ్లిచేసుకోవడం ఏమిటని నవ్విపోయారు. కొందరైతే అలా మాట్లాడినవాళ్ళని తమ మాటలతో కొట్టబోయారు కూడా. కానీ గుప్పుమన్న గాసిప్స్ ని నిజం చేస్తూ పృథ్వీరాజ్ తాజాగా ఓ వార్తని మీడియా వేదికగా తెలియజేసారు. ఇక అదివిన్న నెటిజన్ల నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఇక్కడ పృథ్వీరాజ్ అంటే, మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అదేనండి మొన్నటి సహనటుడు, ప్రతి నాయకుడు పాత్రలు పోషించినటువంటి పృథ్వీ. ఇంకా అర్ధం కాలేదా? వడ్డే నవీన్ హీరోగా చేసిన సినిమాలో విలన్ గా చేసిన పృథ్వీరాజ్ అండి. ఇపుడు గుర్తొచ్చింది కదూ. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇటీవలే మరలా రీఎంట్రీ కోసం చూస్తున్నారు. కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా తాజాగా ఆ వార్తలపై స్పందించారు నటుడు పృథ్వీ.

అవును, ఆ అమ్మాయి వయస్సు 23 కాదని.. 24 అని చెబుతూ.. లివ్ ఇన్ రిలేషన్‏షిప్‏లో ఉన్నామంటూ అసలు గుట్టు విప్పేసాడు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని హితోపదేశం చేస్తున్నాడు. ఇకపోతే ఆమె మలేషియాలో ఉన్నప్పటికీ అచ్చ తెలుగమ్మాయి అని సుస్పష్టం చేశారు. ఇక పృథ్వీరాజ్ 1994లో బీనాను ప్రేమ వివాహం చేసుకోగా వీరికి కుమారుడు అహేద్ మోహన్ జబ్బర్ పుట్టాడు. తన భార్యతో గొడవలు కారణంగా 6 సంవత్సరాలనుండి విడివిడిగా వుంటున్నారు. ఇక త్వరలోనే పృథ్వీరాజ్ శీతల్ ను వివాహం చేసుకోబోతున్నారు.