నయనతార ,విగ్నేష్ శివన్ దంపతులు ఆదివారం రోజున అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. తల్లిదండ్రులైనట్లు గా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అభిమానులు కాస్త ఆనందంలో ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ఆశ్చర్యపోయారు.
తమకు ఇద్దరు ట్విన్స్ మగ పిల్లలు జన్మించారని తమ పిల్లలని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక పోస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు కవలలకు సంబంధించి పాదాలను పోస్టులో షేర్ చేయడం జరిగింది. జూన్ 9వ తేదీన నయనతార, విఘ్నేష్ ఇరువురు కుటుంబాల కలయికతో వీరిద్దరూ ఒకటయ్యారు.
కేవలం నాలుగు నెలలు తిరగకుండానే తల్లిదండ్రులు కావడంతో ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వీరిద్దరూ సరోగసి విధానంలో పిల్లల్ని కనడం అనేది చట్ట విరుద్ధమని కోలీవుడ్ నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇదే కనుక నయనతార దంపతులకు భారీ జరిమానా తప్పదంటూ పలువురు మీడియాలో కథలుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో స్మార్ట్ రిప్లై ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
“నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నీతోనే ఉండి నీకు అంత మంచే జరగాలని కోరుకునే వారి గురించి ఆలోచించు ఎందుకంటే వాళ్లు నీ వాళ్లు ఎప్పటికీ ఇది వాస్తవం సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని నిన్ను చేరుతాయి అప్పటివరకు సహనంతో వేచి ఉండండి ప్రతిక్షణాన్ని ఆస్వాదించు అంటూ రాసుకు వచ్చారు విగ్నేష్” . కేవలం తమ సంతానం పైన వస్తున్న కామెంట్ల పైన ఇలా చాలా తెలివితో రిప్లై ఇవ్వడం ప్రతి ఒక్కరికి ఆచార్యాన్ని కలిగిస్తుంది. ఈ పోస్టు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.