టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తమ టాలెంటును ప్రూవ్ చేసుకోవడానికి హీరో హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టారు. ఇక అలా తాము నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని ఉన్నట్టుండి వరుస డిజాస్టర్లు రావడంతో ఇండస్ట్రీకి కనుమరుగై మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరో హీరోయిన్లు ఇప్పుడు మెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్నారు. కొత్త అందాలు.. కొత్త టాలెంట్లు వస్తున్న తరుణంలో చాలామంది కనపడకుండా పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే కొంతమందిని ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారని చెప్పవచ్చు. అయితే చాలామంది తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా ఛాన్స్ దొరికితే మరోసారి తమ సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓటీటీల హంగామా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఫేడ్ అవుట్ అయిన స్టార్స్ లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి ఓటిటి సంస్థలు. ముఖ్యంగా వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఓటిటి సంస్థలు ఆ స్టార్స్ ని ఎంచుకోవడం గమనార్హం. కరుమరుగైపోయిన హీరోలను, హీరోయిన్లను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక అలాంటి వారిలో హీరోయిన్ సదా కూడా ఒకరు. ఒకప్పుడు జయం సినిమా తర్వాత వరుస సినిమాలతో తమిళ్ భాషలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎక్కువ కాలం రాణించలేదు. ఇండస్ట్రీకి దూరమైన ఈమె ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇక తర్వాత ప్రముఖ దర్శకుడు ఈ. వీ.వీ. సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్ కూడా ఒకరు. ఈయన హీరోగా గతంలో ప్రేక్షకులను మెప్పించినా ఆ తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు.
కానీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించాడు. కానీ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఇక వీరే కాకుండా అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్, హీరోయిన్ లయ కూడా చాలా కాలం తర్వాత వెబ్ సిరీస్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఒకప్పుడు ఫేడ్ అవుట్ అయిన వీరు ఇప్పుడు ఓటీటీ ల ద్వారా తిరిగి అదృష్టాన్ని సంపాదించుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.