టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..యమ జోరు మీద ఉన్నారు. ఒక్క సినిమా కంప్లీట్ కాకుండానే మరో సినిమా కి సైన్ చేస్తూ..వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెడుతున్నారు. ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో “సర్కారు వారి పాట” అనే సినిమా లో నటిస్తున్న ఈ స్టార్ హీరో.. ఈ సినిమా కంప్లీట్ కాకుండానే ..మాటల మాంత్రికుడు త్రిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు..పుజా కార్యక్రమాలను కూడా ఫినిష్ చేశాడు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ మే నెలలో స్టార్ట్ కావాల్సింది. కానీ ఎండలు ఎక్కువ గా ఉంటాయి అని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్న కారణంగా..మహేష్ ఆ సెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకుని..విదేశాలకు వెళ్ళనున్నాడు అని టాక్ వినిపిస్తుంది. సో.. ఈ సినిమా లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుగా ఉన్నాయి. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాకముందే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ మరో ప్రతిష్టాత్మక చిత్రం లో నటించనున్నాడు. ఈ విషయం పై ఆల్ మోస్ట్ అఫిషియల్ ప్రకటన వచ్చేసిన్నట్లే.. స్క్రిప్ట్ కూడా రెడి.
కాగా, ఓ సినిమా ఫైనల్ షెడ్యూల్ ..మరో రెండు సినిమా లకు కమిట్ అయిన ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు..రీసెంట్ గా మరో డైరెక్టర్ కు మాట ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. యస్.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో..మహేష్ బాబు ఓ సినిమాకు కమిట్ అయ్యిన్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గానే బోయపాటి మహేష్ ను కలిసి కధను చెప్పారట..స్టోరీ నచ్చడంతో మహేష్ వెంటనే ఓకే చేశారట. అయితే..ఈ సినిమా మాత్రం త్రివిక్రమ్, రాజమౌళి ప్రాజెక్ట్స్ తర్వాత నే ఉండనుందట. హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుందని ఫిలిం నగర్ టాక్. కానీ అభిమానుల వర్షెన్ మరోలా ఉంది. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో మహేష్ బాబు కధ సూట్ అవ్వదు అని..మహేష్ క్లాస్ డైరెక్టర్ లతోనే సినిమాలు చేస్తే బెటర్ అని..లేనిపోని రిస్క్ లు చేయవద్దు అని అంటున్నారు. కాగా ప్రస్తుతం బోయపాటి శ్రీను హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నాడు.