టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భీమ్లానాయక్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. 2020 అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా ఎఫెక్ట్తో మధ్యలో రెండు మూడు సార్లు వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అత్తారింటికి దారేది సినిమా తర్వాత మధ్యలో పవన్ ఏ సినిమాకు రాని హ్యూజ్ అప్లాజ్ ఈ సినిమాకు వచ్చింది. ఇక ఏపీలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు లేవు. దీంతో తెలంగాణలో మాత్రం అర్ధరాత్రి దాటిన వెంటనే కొన్ని చోట్ల షోలు వేశారు. ఇక తెలంగాణ అంతటా ఉదయం 4-5 గంటల నుంచే షోలు మొదలైపోయాయి.
ఇక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల సహా ఓవర్సీస్ లో కూడా భీమ్లా నాయక్ మొట్ట మొదటి రోజే రోరింగ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ మధ్య కాలంలో పవన్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే లేదు. దీంతో పవన్ అభిమానుల సందడి మామూలుగా లేదు. ఇక ఓవర్సీస్లో కేవలం బుకింగ్లతోనే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసి $666,827 డాలర్ల వసూళ్లను దాటేసింది.
ఈ జోరు చూస్తుంటే ఫస్ట్ డే నే ఈ సినిమా సులువుగా మిలియన్ మార్క్ క్రాస్ చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా దర్శకుడు సాగర్ చంద్ర పవన్ మరియు రాణాలతో కలిసి ఒక భారీ హిట్ ని అందుకున్నట్టే అని చెప్పాలి.