సల్మాన్ ఫామ్ హౌస్ లో దారుణాలు.. పరువు నష్టం దావా వేసిన కండల వీరుడు..

సల్మాన్ ఖాన్ వేసిన పరువు నష్టం కేసు విచారణ కొనసాగుతుంది. ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన వారిపై కోర్టులో కేసు వేశాడు. తన పన్వెల్ ఫామ్ హౌస్ కు సమీపంలో ఉన్న వారితో కోర్టులో కొట్లాడుతున్నాడు. సల్మాన్ ఖాన్ న్యాయవాది ఈ కేసు గురించి కొన్ని వివరాలను వెల్లడించాడు. తన ఫామ్ హౌస్ కు సమీపంలోని కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సోషల్ మీడియాతో పాటు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని ఆరోపణలను ప్రస్తావించాడు. అందులో సల్మాన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌస్ లో పలువురు సినీ తారల బాడీలను పూడ్చి చెప్పాడని ఆరోపించాడు. అంతేకాదు.. పిల్లల అక్రమ రవాణా కొనసాగుతుందని కేతన్ కక్కడ్ వెల్లడించాడు.

ఈ ఆరోపణలను సల్మాన్ ఖాన్ తీవ్రంగా పరిగణించాడు. తన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆయన న్యాయవాది ప్రదీప్ గాంధీ వెల్లడించాడు. సల్మాన్ ఫామ్ హౌస్ కు దగ్గర్లోని పోరుగు వారి వీడియోలు, పోస్టులు, ట్వీట్ల ద్వారా తప్పుడు, అవమానకరమైన, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని తెలిపాడు. వాటిని ఎదుర్కొనేందుకు షార్ట్ కాజ్ సివిల్ దావా వేసినట్లు చెప్పాడు. తమకున్న భూ వివాదంలో అర్పితా ఫామ్స్ పక్కన ఉన్న ఫ్లాట్ లోకి సల్మాన్ ఖాన్ తమను రానివ్వకుండా అడ్డుకున్నాడని కేతన్ తెలిపాడు. అయితే సల్మాన్ లాయర్ దాన్ని ఖండించాడు.

అటు సల్మాన్ తరపున న్యాయవాది పొరుగు వారిపై పరువు నష్టం కేసులో వాదనలు పూర్తి చేశాడు. తన ప్రతి బర్త్ డేను సల్మాన్ ఇక్కడ జరుపుకుంటాడు. ఈ ఫామ్ హౌస్ కు సల్మాన్ తన సోదరి అర్పిత పేరు పెట్టుకున్నాడు. లాక్ డౌన్ ఫస్ట్ వేవ్ వేళ సల్మాన్ ఇక్కడే ఉన్నాడు. స్నేహితులు, బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే పొరుగున్న ఉన్నవారి భూములను సల్మాన్ లాక్కుంటున్నాడని పరిసర జనాలు ఆరోపించారు. అంతేకాదు.. తమ జీవితాలను ఆగం చేసే కుట్రను చేస్తున్నాడన్నారు. అయితే వారి ఆరోపణలను ఖండించడంతో పాటు పరువు నష్టం కేసు వేశారు. న్యాయపోరాటం చేస్తున్నాడు సల్మాన్ న్యాయవాది.