మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుధీర్ బాబు హీరోగా .. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం అమ్మాయి గురించి మీకు చెప్పాలి.అయితే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ప్రకటించడం జరిగింది. థియేటర్లలో విడుదల చేస్తాము అని ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త బాగా వైరల్ గా మారింది.
ఇకపోతే కృతి శెట్టి ఇప్పటికీ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా తో ఓవర్ నైట్ లో ని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది.ఆ తర్వాత నాని హీరోగా శ్యామ్ శింగరాయ్ సినిమాలో సాయి పల్లవి తో కలిసి నటిస్తోంది ..అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కు సిద్ధంగా లేదు..ఇప్పుడు తాజాగా మరో సినిమా లో నటించింది. ఇక మహేష్ బాబు బావమరిది అయిన సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఇక ఇవే కాకుండా బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తోంది. ఇక అలా ఈమె సినిమాలలో అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ ఉంది. ఈమె నటించిన సినిమాలన్నీ సక్సెస్ అయితే ఈమె రెమ్యూనరేషన్ కూడా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
#AaAmmayiGurinchiMeekuCheppali
Shooting part completed. Film set to release in theatres soon. Mythri Movies On-Board as presenter. #SudheerBabu #KrithiShetty pic.twitter.com/SjYj0w8BmZ
— Aakashavaani (@TheAakashavaani) December 29, 2021