దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా ఈయన కుమారుడు ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా, ఇక ఈయన భార్య మాత్రం హైదరాబాద్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో ఒక మంచి ప్లేయర్. ఈ విషయం చాలామందికి తెలియదు అని చెప్పాలి.. తాజాగా అండర్-19 ఉమెన్ క్రికెట్ పోటీలలో ఇషిత ఆటకు ఒక్కసారిగా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు..
ప్రస్తుతం రాజ్ కోట్ లో ఉమెన్ అండర్-19 క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఇక ఇందులో హైదరాబాద్ టీంతో ఉత్తరప్రదేశ్ తలపడనుంది.. బౌలర్ గా ఇషిత మూడు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. ఈ మ్యాచ్ గెలవడానికి ఇషిత బౌలింగ్ మెయిన్ రోల్ ప్లే చేసిందని అందరూ ఎంతో గర్వంగా చెబుతున్నారు.. ఇకపోతే ఈ విషయాన్ని తాజాగా రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. స్పోర్ట్స్ ఫ్యాన్ అయిన నేను నా పిల్లలను క్రికెట్ ఫీల్డ్ లో కి పంపాలి అనుకున్నాను.. కానీ వారి ఇష్టప్రకారం వేర్వేరు ఫీల్డ్స్ ని ఎంచుకున్నారు.. కానీ నా కోడలు ఇషిత కోడూరి.. హైదరాబాద్ స్టేట్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టీం ఎంపిక అయ్యి , ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ కు పోటీగా ఆడనుంది.. ఆల్ ద బెస్ట్ తల్లి అంటూ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
As an avid sports fan, I had tried to push our kids into the arena but they chose different paths. Delighted that my niece, Ishitha Koduri, has been selected for the Hyderabad State Senior Women's Cricket team and will play against Himachal Pradesh today. All the best thalli.. pic.twitter.com/ASLVUmr3hU
— rajamouli ss (@ssrajamouli) October 31, 2021