`పెళ్ళిచూపులు` సినిమాతో యూత్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి రీతూ వర్మ.. తాజాగా నటించిన చిత్రం `వరుడు కావలెను`. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 29ను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ వర్మ.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే తన పెళ్లి ఎప్పుడు అన్నది కూడా చెప్పేసింది. రితూ మాట్లాడుతూ.. `మరో రెండు మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి నిర్ణయాన్ని మా ఇంట్లో నాకే వదిలేశారు.
ఆ విషయంలో పేరెంట్స్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. పెళ్లిపై తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే అప్పుడప్పుడు పెళ్లెప్పుడని సరదాగా ఆటపట్టిస్తుంటారు` అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడామె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.