టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను సమంత గానీ, నాగ చైతన్య గానీ, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఖండించలేదు. పైగా సమంత ఇన్స్టాలో షేర్ చేస్తున్న కొటేషన్స్, ఒంటరిగా గోవాకు వెళ్లడం, తిరుమలలో మీడియా మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
అంతేకాదు, సమంతకు 300 కోట్లకు పైగా చైతు భరణంగా ఇవ్వబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. దాంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక అక్కినేని అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అయితే సామ్-చై విడాకులు ఎంత వరకు నిజమో ఈ రోజే స్పష్టత రానుంది. అదెలా అంటే.. ఈ మధ్య ఫ్యాన్స్తో చిట్చాట్స్కు దూరంగా ఉంటున్న సమంత నేడు తన అభిమానులతో ముచ్చటించనుంది.
ఈ రోజు (సెప్టెంబర్ 28) సాయంత్రం 5 గంటలకు సమంత ఇన్స్టా ద్వారా ముచ్చట్లు పెట్టబోతోంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. ఇక ఈ చిట్చాట్లో అభిమానులు ఖచ్చితంగా సమంతను డివోర్స్పై ప్రశ్నిస్తారు. మరి అందుకు సామ్ ఏం అన్సర్ చేస్తుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.