ఈ రోజుల్లో రూపాయికి తినడానికి ఏమోస్తుందో చెప్పండి అంటే ఒక్క పేరు కూడా చెప్పలేం. కానీ ఒక ప్రాంతంలో ఒక మండలి రూపాయికే భోజనం పెడుతోంది. అంతేకాదు, రూపాయికే రెండు రొట్టెలు, అన్నం, దాల్, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తున్నారు. ఎక్కడ..? ఎవరు..? వివరాలు తెలుసుకుంటే.. కర్ణాటక రాష్ట్రంలో రకరకాల భోజనాన్ని రూపాయికే అందించడానికి జైన్ యువక మండలి ముందుకు వచ్చింది.
నిరుపేదల ఆకలి తీర్చేందుకే ఈ రూ.1 భోజన పథకం తీసుకొచ్చామని జైన్ యువక మండలి చెబుతోంది. అయితే ఈ భోజన పథకాన్ని బళ్లారి నగరంలోని జైన్ దేవాలయం సమీపంలో ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఆరంభించారు. ఈరోజు నుంచే రూపాయికి భోజనం అందించడం ప్రారంభించారు. బళ్లారి నగరంలోని ఆసుపత్రులు, బస్టాండ్ల సమీపంలో ఈ రూ.1 భోజనాలను అందించనున్నారు.