టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం వివాహ భోజనంబు సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కమెడియన్ సత్య హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో పెళ్లి చేసుకున్న ఒక పిసినారి ఒక ఇంట్లో అతని బంధువులు 16 మంది లాక్ డౌన్ వల్ల ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ఆ 16 మందిని పోషించడానికి ఆఫీస్ ఉన్నారు యువకుడు ఎటువంటి పనులు చేశాడు అనే అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. అలాగే ఈ సినిమాలో నేను డ్రైవర్ పాత్ర చేశాను అని చెప్పుకొచ్చారు సందీప్ కిషన్.
అలాగే నేను నటుడిగా 12 ఏళ్లుగా కష్టపడుతున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు రాబోతోంది. మంచి ప్రాజెక్ట్ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది ఫ్యామిలిమ్యాన్ 3, సిరీస్ లలో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో ఒక సినిమా, అలాగే మరో మూడు ప్రాజెక్టు లు ఉన్నాయి అని తెలిపారు. వివాహ భోజనంబు సినిమా ఈ నెల 27 నుంచి సోనీ లైవ్ ఓటి ప్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే నేను హీరోగా నటించిన గల్లీ రౌడీ సినిమా మాత్రం థియేటర్స్ లోనే వస్తుంది అని తెలిపారు సందీప్ కిషన్.