ప్రస్తుతం టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం హాట్టాపిక్గా మారింది. ఈసారి మా అధ్యక్ష పదవీకి పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించి ‘సినిమా బిడ్డలు’ పేరిట ప్యానల్ను ఏర్పాటు చేశారు. కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘మా’ భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడమే ముఖ్య అజెండాగా పోటీలోకి దిగారని కానీ తన దృష్టిలో ‘మా’కు బిల్డింగే అవసరం లేదని అన్నారు. ‘మా’లోని 900 సభ్యులలో చాలా వరకు దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నారని.. వారంతా ప్రతినెలా రెంట్ కూడా కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మా బిల్డింగ్ కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని ఆయన సలహా ఇచ్చారు.