న్యూ రికార్డును సొంతం చేసుకున్న చిరు పాట..?

గత కొంత కాలంగా తెలుగు సినిమా పాటలు, టీజర్స్, ట్రైలర్స్ యూట్యూబ్ లో సంచలన రికార్డులు నెలకొల్పుతున్నాయి. వ్యూస్ పరంగా.. తక్కువ కాలంలోనే 50 మిలియన్ మార్క్ ని చేరుకుంటున్నాయి. తాజాగా చిరంజీవి సినిమాలోని ఓ పాట కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించి ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత బాణీలు సమకూరుస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆయన స్వరపరిచిన “ఆచార్య” ఫస్ట్ సింగిల్ “లాహే లాహే” ఇటీవలే విడుదల కాగా.. అది తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. నిజానికి ఈ పాటకు అందించిన సంగీతం వింటుంటే.. ఎంజాయ్ చేయకుండా ఎవరు ఉండలేరు. ఆ స్థాయిలో మణిశర్మ ఈ పాటకు సంగీత బాణీలు అందించారని చెప్పుకోవచ్చు. బహుశా అందుకేనేమో ఈ పాటకి కేవలం రెండు నెలల వ్యవధిలోనే 50 మిలియన్లు అనగా ఐదు కోట్ల వ్యూస్ వచ్చాయి. అయితే చిరంజీవి కెరీర్ లో 50 మిలియన్ వ్యూస్ సంపాదించిన పాటల్లో ఒకటిగా “లాహే లాహే” నిలవడం విశేషం. ఈ సినిమాలో జంటగా నటిస్తున్న రామ్ చరణ్-పూజా హెగ్డే లపై కూడా ఒక సాంగ్ త్వరగా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.