మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదటి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు.
భారీ లాభాలు రావడంతో ఉప్పెన నిర్మాతలు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. మరోవైపు బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బుచ్చిబాబు తన రేటును భారీగా పెంచేశాడట.
తాజా సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు తన రెండో సినిమాకు రూ. 8 కోట్లు పారితోషకం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండవ సినిమాకే ఈ స్థాయి పారితోషికం అందుకోనున్న అతి తక్కువమంది దర్శకులలో బుచ్చిబాబు చేరిపోయారు. కాగా, బుచ్చిబాబు తన సెకెండ్ మూవీని ఓ స్టార్ హీరోతో చేయనున్నాడని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.