ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. ఆ టీమ్ ప్రముఖ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్దత్ పడిక్కల్ కూడా కరోనా సోకటంతో వాళ్ళకి పెద్ద షాక్ కి గురి అయ్యారు. ఈసారి బెంగళూరు టీమ్ అతని పై భారీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్కు కేవలం ఐదు రోజుల టైం ఉన్న ఈ సమయంలో పడిక్కల్కు కరోనా బారిన పడటంతో ఆ టీమ్కే కాదు ఐపీఎల్ నిర్వాహకులకు కూడా ఇది పెద్ద షాకె.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇంకా ఇది వరకు కొవిడ్ పాజిటివ్గా తేలిన కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ నితీష్ రాణా, పూర్తిగా కోలుకొని మళ్లీ టీమ్లో చేరాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ను కరోనా మహాహమారి వదల్లేదు. ఇప్పుడు మళ్ళి టీం ప్లేయర్స్కు కూడా ఈ మహమ్మారి సోకుతుండటం నిర్వాహకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.