తారక్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. ఆ సీక్వెన్స్ దెబ్బకు మైండ్ బ్లాకే..!

సౌత్ ఇండస్ట్రీలో కేజిఎఫ్ సిరీస్, సలార్‌తో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారట. ప్రశాంత్ నీల్‌ మార్క్.. డార్క్ థీమ్ యాక్షన్ డ్రామాగా.. ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో తారక్‌ పాత్రను.. మరింతగా ఎలివేట్ చేసేందుకు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రశాంత్ నీఈల్‌ ప్లాన్ చేశాడని టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సీక్వెన్స్ కోసం ఓ భారీ పోలీస్ స్టేషన్ సేట్‌ను సిద్ధం చేశాడట.

ఇందులో హీరో.. ఎన్టీఆర్ పై నెవ‌ర్ బిఫోర్ రేంజ్‌లో హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ రూపొందనుందని.. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో బీస్ట్ అవతార్ లో.. తార‌క్‌ సింహ గర్జన చేయనున్నాడని టాక్‌. సినిమా మొత్తానికి ఈ ఫైట్ సీక్వెన్స్ హైలెట్ గా మారనుందట‌. 500ల‌కు పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ ఫైట్ సీన్లో పాల్గొన‌నున్నట్లు సమాచారం. రెగ్యులర్ యాక్షన్ సీక్వెన్స్‌కు పూర్తి భిన్నంగా ఈ సన్నివేశాలు రూపొందించ‌నున్నార‌ని చెబుతున్నారు. భారీ.. అల్లర్ల నేపథ్యంలో.. ఎన్టీఆర్ చలరేగి చేసే స్టంట్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులతో పాటు.. సినీ లవర్స్ అందరిని మెప్పిస్తాయని సమాచారం. ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందంటూ టాక్ నడుస్తుంది.

ఇక భారీ కాన్వాస్ పై హాలీవుడ్ రేంజ్‌లో విజువల్స్‌ని తెరపై ఆవిష్కరించడంలో ప్రశాంత్ నీల్‌.. తనదైన మార్క్‌ను చూపించాడు. అదే పంథాని కొనసాగిస్తూ.. డ్రాగన్‌ని కూడా హై వోల్టేజ్ విజువల్ వండర్ గా రూపొందిస్తున్నాడట. ఈ క్రమంలోనే.. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ మహోగ్రరూపం కనిపించనుందని.. ఒక మాటలో చెప్పాలంటే ఈ సీన్లు ఎన్టీఆర్ మాస్ అవతార్‌లో భయంకరంగా రెచ్చిపోతాడని.. ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక భారీ పాన్ ఇండియ‌న్‌ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో.. కన్నడ బ్యూటీ రుక్మిణి వ‌సంత్‌ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇక మైత్రి మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చేయడాది జూన్ 25న ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు టీం.