ఆ ఒక్క మ్యాటర్‌లో జగన్‌ను ఫాలో అవనున్న పవన్.. ఇక వాళ్లకు చుక్కలే..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పవన్.. ఓ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నాడంటూ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో ఏపీ.. ఎక్స్ సీఎం వైయస్ జగన్ టికెట్ రేట్లను పెంచకుండా.. అతి తక్కువ రేట్లతో సినిమాలను రిలీజ్ చేపించి.. మల్టీప్లెక్స్ ఓనర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ తన సినిమా విషయంలో కుట్ర జరిగిన నేపథ్యంలో.. ఏపీలోను థియేటర్ల పై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.

టికెట్ రేట్ల విష‌యంలో ప‌వ‌న్ కూడా అలాంటి క‌ఠిన నిర్ణ‌యాలే తీసుకోనున్నాడ‌ట‌. థియేటర్ల యజమానులు ఎవరు.. ఎంత పన్ను తీసుకుంటున్నారు.. సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. అనే విషయాలను ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ నేప‌ద్యంలో ఏపీలో ఉన్న మల్టీప్లెక్స్‌ల వివరాలను సైతం నేను ఆరా తీశాను అంటూ పవన్ స్వయంగా కామెంట్స్ చేయడం విశేషం. దీయేట‌ర్‌ల విష‌యంలో గుప్తాధిప‌త్యనికి చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. థియేటర్ల యజమానులు.. థియేటర్లలో శుభ్రతకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా.. థియేటర్ల క్యాంటీన్ పై ఎక్స్ట్రా చార్జెస్ తో దండుకుంటున్న యాజమాన్యాలపై కూడా పవన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

అధికారులకు మరింత పవర్స్ ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినీ వ్యవస్థలో ఉండే లోపాలన్నీ తెలిసిన పవన్ కళ్యాణ్.. తీసుకోబోయే నిర్ణయాలు థియేటర్లకు ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తాయో.. మేలు చేస్తాయా.. లేదా కీడు చేస్తాయా.. అనేది వేచి చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ కోపంగా ఈ కామెంట్లు చేయడం అందరికీ కాస్త ఆందోళన తెప్పిస్తున్న.. రాబోయే రోజుల్లో ఈ కోపం కూల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో.. మరోసారి ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా మారనుంది. ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశాలైతే కనిపించడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న సినిమాలపై ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉండ‌నుందో వేచి చూడాలి.