నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య నట తాండవం చూడడానికి అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో.. సర వేగంగా షూట్ను జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఇదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న అఖండ తాండవం రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా టీం ప్రకటించారు. కానీ.. ఇప్పుడు అనుకున్న టైంకి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని టాక్ నడుస్తుంది. మేకర్స్ పక్కగా రిలీజ్ అవుతుంది అని చెప్తున్నా.. దసరా నుంచి అఖండ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.
దీంతో.. అఖండ ప్లేస్లో ఓజీ రిలీజ్కు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీపై ఆడియన్స్లో.. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం ఫైనల్స్ షెడ్యూల్ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ స్కెడ్యూల్తో ఓజీ షూటింగ్ పూర్తి అయిపోతుంది. దీంతో.. వీలైనంత త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి.. రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ 2 పోస్ట్పోన్ అయితే.. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ చేసే ఆలోచనలో టీం ఉన్నారట.
ఒకవేళ అఖంట 2 రేస్లో ఉన్నా.. ఓజీ మాత్రం రంగంలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే.. బాలయ్య వర్సెస్ పవన్ బాక్సాఫీస్ వార్కు అవకాశాలు చాలా రేర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి.. రెండు సినిమాల్లో ఏదో ఒకటి దసరా బరిలో కచ్చితంగా సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది దసరకు.. ఓజి ఊచకోత ఉంటుందా.. లేదా అఖండ తాండవం చూస్తామా.. వేచి చూడాలి. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే మాత్రం పవన్ వర్సెస్ బాలయ్య మధ్యన పోటీ ఆడియన్స్ లో మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి డేసిషన్ తీసుకుంటారు వేచి చూడాలి.