టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన సినీ కెరీర్లో రీఎంట్రీ తర్వాత నటించిన భోళా శంకర్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చిరంజీవి ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను కూడా ఆయన పక్కన పెట్టేసాడు. రొటీన్.. మాస్, కమర్షియల్ సినిమాలకు కూడా కొన్నేళ్లు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్న చిరు.. జగదేకవీరుడు, అతిలోకసుందరి, అంజి తర్వాత తన కెరీర్లో మళ్లీ ఇంత కాలానికి సోషియా ఫాంటసీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇన్నేళ్ల తర్వాత వశిష్ఠతో కలిసి సోషియ ఫాంటసీ డ్రామాగా విశ్వంభర సినిమాను నటించాడు. ఈ సినిమా షూట్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో.. త్వరలోనే రిలీజ్ డేట్ని కూడా అఫీషియల్గా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక దీంతోపాటే.. అనిల్ రావిపూడితో.. ఓ కామెడీ జానర్ మూవీని నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా షూట్ సైతం ప్రారంభమైంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి.. చిరంజీవి సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్తో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే.. సినిమా కచ్చితంగా ఆడియన్స్ను మెప్పిస్తుందని.. చిరంజీవితో సహా టీమ్ అంతా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందట. నయనతార హీరోయిన్గా.. మాస్ యాక్షన్ సీరియస్ లుక్లో చిరు మెరవనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత.. బాబీతో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్గా మరో కథను నటించనున్నాడు చిరు. 2026 లో ఈ ప్రాజెక్టు సెట్ పైకి రానుందని టాక్. గతంలో ఈ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.