ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న ఇద్దరు హీరోలకు సంబంధించిన ఓ షాకింగ్ అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. గతంలో ప్రభాస్ నటించాల్సిన ఓ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ అడ్డుపడ్డాడంటూ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఎన్టీఆర్ అడ్డుపడడానికి గల కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
దాదాపు రెండున్నర దశాబంధాల క్రితం.. అంటే ఎన్టీఆర్, ప్రభాస్ అప్పుడప్పుడు కెరీర్లో నిలదొక్కుకుంటున్న టైంలో.. ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు తీసేందుకు ఎంతో మంది ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు. ఎన్టీఆర్ – సింహాద్రి, ప్రభాస్ – వర్షం సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ గా రాణిస్తున్న ఆవుల గిరి.. ప్రభాస్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఓ రోజు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ సమక్షంలోనే ఆయనకు అడ్వాన్స్ ఇచ్చేసి సినిమాను కన్ఫర్మ్ చేయించుకోవాలని ఫిక్స్ వెళ్ళాడట.
అయితే ఇంటికి వెళ్లిన తర్వాత ఆవుల గిరికు ప్రభాస్ తండ్రీ ఈరోజు మంచి రోజు కాదు.. అడ్వాన్స్ మూడు రోజుల తర్వాత తీసుకుంటానని చెప్పి పంపించేసారట. ఇక ఈ గ్యాప్ లో ఆవుల గిరి అంటే గిట్టని కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ను పక్కనే కూర్చోపెట్టుకొని మరీ.. ఆయనతో ప్రభాస్కు ఫోన్ చేపించి అతనితో సినిమా వద్దని చెప్పించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆవుల గిరి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్.. ప్రభాస్కు ఫోన్ చేయడంతోనే ప్రభాస్ తన బ్యానర్ లో సినిమా చేయలేనని చెప్పేశాడని వివరించారు. కాగా ఎన్టీఆర్ తో ప్రభాస్కు ఫోన్ చేయించినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒకరు స్వయంగా నాకు కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పారంటూ గిరి చెప్పుకొచ్చాడు. కొందరు వ్యక్తులు ప్రభాస్ తన బ్యానర్ లో సినిమా చేయకుండా అడ్డుపడ్డారని.. అయినా నాకు అసలు ఇబ్బంది ఏమీ లేదు అంటూ ఆవుల గిరి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.