చిరు, బన్నీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి.. మ్యాటర్ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవ‌డం అంటే అది సాధారణ విషయం కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హోదా సాధించాలంటే ఎన్నో అవమానాలు, కష్టాలు భరించాల్సి ఉంటుంది. అలా.. ఒకప్పటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఓ వెలుగు వెలిగారు. ఇక వీళ్ళ తర్వాత నెక్స్ట్ చిరంజీవి అదే రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజె సంపాదించుకుని రాణించాడు. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో రాజకీయాల్లో పై ఫోకస్ పెట్టి.. రాజకీయాలు వైపు వెళ్లారు.

Malla Reddy Claims Allu Arjun Surpassed Chiranjeevi

సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. అయితే పొలిటికల్ గా సరైన సక్సెస్ అందకపోవడంతో తిరిగి ఇండస్ట్రీలో ఇచ్చి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక‌క రీయంట్రి తర్వాత చిరు సరైన్న సినిమాలను ఎంచుకోవడంలో కాస్త వెనకబడ్డారని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన రేంజ్ కు తగ్గట్టు ఒక్క సక్సెస్ కూడా అందలేదు. ఇలాంటి తరుణంలో మాజీ టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి.. చిరంజీవి అలాగే అల్లు అర్జున్ ల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amid Chiranjeevi-Allu Arjun Feud Rumours, Photo Megastar Feeding Pushpa 2 Laddoos Goes Viral - News18

చిరంజీవి తర్వాత స్థానం అల్లు అర్జున్ దక్కించుకున్నాడని.. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిపోయిందని.. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ కావాలని ఆయన వెల్లడించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడని.. దాని క్రేజ్‌ కూడా పెరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ఏకంగా రూ.18 కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంటే ఆయనకు ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు చేశాడు. కొత్త తరానికి బన్నీ బాగా కనెక్ట్ అయ్యాడని.. బన్నీపై మల్లారెడ్డి ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో.. మల్లారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.