టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్లో వార్2 సినిమాతో బిజీగా గడుపుతున్నాడు తారక్. సినిమా షూట్ పూర్తయిన వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్తో.. మరో ప్రాజెక్టులో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. కాగా ఈ సినిమా టైటిల్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయకున్నా.. డ్రాగన్ పేరుతో తెగ వైరల్ గా మారుతుంది.
అయితే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. జనవరి 16, 2025న మంగుళూరులో షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ తాజా రూమర్స్ నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఇంకా అధికారిక అప్డేట్ రాకుండా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండింగ్గా మారింది. పైగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న వరల్డ్ వైడ్గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండనుంది.. వీరాభిమాని అంటూ చెప్పుకునే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ను ఈ సినిమాలో ఎలా చూపించనున్నాడని ఆసక్తి అభిమానంలో మొదలైంది.
మొత్తానికి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వైరల్గా మారుతూనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు రవి బసౄర్ సంగీతం అందించారు. ఇక సెట్స్పైకి రాకముందే ఆడియన్స్లో అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుని రిలీజైన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.