ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్.. తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్, మీడియం మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు కలిపి కాంబోలెక్కన బయ్యర్లకు ఇచ్చేశాడట.
సిడెడడ్ మినహ.. ఆంధ్ర, మిగిలిన అన్ని ప్రాంతాల్లో రెండు సినిమాలను కలిపి రూ.80 కోట్లకు ఇచ్చారు. ఇందులో గేమ్ ఛేంజర్ రూ.65 కోట్లు కాగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.15 కోట్లకు అమ్ముపోయింది. ఇక ఏపీలో వైజాగ్ ఏరియా ను నిర్మాత దిల్ రాజే పంపిణీ చేసుకుంటున్నాడు. ఇవే రెండు సినిమాలు కలిపి సీడెడ్ ఏరియాకు రూ.27 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. అందులో గేమ్ ఛేంజర్ రూ.22 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం రూ.5 కోట్లకు ఇచ్చారు.
ఈ సినిమా నైజాం ఏరియాలో నిర్మాత దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేసుకుంటున్నాడు. ఇక బాలకృష్ణ హీరోగా.. నాగవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా బిజినెస్లు కూడా.. కళ్ళు చెదిరే రేంజ్లో జరిగాయట. నైజం ఏరియాకు.. సినిమా రూ.18 కోట్లకు విక్రయించగా.. సీడెడ్ మినహ..ఏపీ ఏపీ మొత్తంలో రూ.60 కోట్లకు అమ్మేశారు. ఈ సినిమాకు నైజం లో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. మొత్తం మీద మూడు సంక్రాంతి సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగానే బిజినెస్ సాధించాయి. ఇక ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి.