మెగా బ్యాక్ గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తమ అద్భుత టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రాంచరణ్, అల్లు అర్జున్. కెరీర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ ఎన్నో అవమానాలు, ట్రోల్స్ ఎదుర్కొన్నా.. తమ టాలెంట్తో మెల్లమెల్లగా ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు. చరణ్.. మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్.. ఆర్ఆర్ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్నాడు.
ఇక బన్నీ కూడా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే తన టాలెంట్ తో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. దీని తర్వాత తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కెరీర్లో ఎదిగిన తీరు.. ఎంతోమందికి ఆదర్శం. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ని పెట్టి ఒ క్రేజి మల్టీ స్టారర్ తీయాలని ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ క్రేజీ ప్రాజెక్టుకి అట్లీ దర్శకుడని సమాచారం. గతంలో ఈ కాంబోలో ఎవడు సినిమా రిలీజ్ అయింది. కానీ.. ఈ సినిమాలో బన్నీ కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే ప్రత్యేక రోల్ లో కనిపించాడు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ఇద్దరితో.. ఎలాగైనా ఓ మల్టీస్టారర్ తీయాలని నిర్ణయించుకున్నాడట కరణ్. వాళ్లు కూడా దానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఒకవేళ నిజంగానే సినిమా ఫిక్స్ అయితే భవిష్యత్తులో రాజమౌళి సినిమాలు అన్ని రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేస్తుందంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.