ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎలాంటి కాన్సెప్ట్లతో ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంటేనో.. లేదా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితేనే తప్ప.. సినిమా కోసం ఆడియన్స్ థియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఓల్డ్ సినిమాల రిలీజ్ ట్రెండింగ్ గా మారింది. ఇలాంటి క్రమంలో రీ రిలీజ్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి స్పందన వస్తుంది.
కాగా ఈ పాత సినిమాల రిలీజ్ ట్రెండ్ను ప్రభాస్ ఫ్యాన్స్ మరింత డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ అక్టోబర్ 23న ఏకంగా ఒకేసారి మూడు వేరువేరు సినిమాలను తెలుగు తెరపై తీసుకోవచ్చారు. సూపర్ హిట్స్గా నిలిచిన మిస్టర్ పర్ఫెక్ట్, సలార్..సీజ్ ఫైర్, ఈశ్వర్ సినిమాలను పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా ప్రభాస్ బర్త్డేను మరింత గ్రాండ్ గా మార్చే ప్రయత్నం చేశారు, ఇప్పటివరకు రీ రిలీజ్ లో వచ్చిన ప్రతి సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. కొన్ని సినిమాలైతే రీ రిలీజ్ లో కాసుల వర్షాలు కురిపించాయి. కానీ.. ప్రభాస్ నుంచి వచ్చిన మూడు సినిమాలు బిగ్ షాక్ ఇచ్చినట్లు అయింది.
కేవలం ప్రభాస్ నుంచి వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ తప్ప.. మిగతా రెండు సినిమాలు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాయి. మిస్టర్ పర్ఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కాస్తంత ఓకే అనిపించుకుంది. దీంతో ఓ మోస్తారు కలెక్షన్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభాస్ రేంజ్లో రీ రిలీజ్ సినిమాలు ఏవి కనీసం టచ్ కూడా చేయలేకపోయాయి. ఇక ఈశ్వర్ సినిమా అయితే వచ్చిందని కూడా చాలామంది పట్టించుకోవడం మానేశారు. అలా ప్రభాస్ బర్త్డే కనుకగాగ వచ్చిన మూడు సినిమాలు ఆడియన్స్కు నిరాసే మిగిల్చాయి. ఈ క్రమంలో రీ రిలీజ్ విషయంలో రెబల్ స్టార్ అభిమానులకు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. అయితే మొదట ఆరు సినిమాలను ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేయాలని భావించినా.. తర్వాత కేవలం మూడు సినిమాలతో ప్లాన్ మార్చేసి మిర్చి, ఛత్రపతి, రెబల్ సినిమాలను ఆపేశారు. లేదంటే ఈ సినిమాలది కూడా అదే పరిస్థితి అయ్యేది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.