గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. మొదట 2024 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే భారీ బడ్జెట్ సినిమా కావడంతో సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో రిలీజ్ డేట్ ను మార్చారట మేకర్స్. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ రికార్డ్ స్థాయికి అమ్ముడుపోవడం ఇప్పుడు నెటింట సంచలనంగా మారింది.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కళ్ళుచెదిరే రేటుకు హక్కులుకొనుగోలు చేసిందట. ఇంతకీ ఆ ఓటీటీ సంస్థ మరేదో కాదు.. అమెజాన్ ప్రైమ్. గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే ఈ రేంజ్ లో ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. గేమ్ ఛేంజర్ హక్కులు ఇక్కడ రికార్డు ధరకు కొనుగోలు చేసినట్లే.. హిందీ డిజిటల్ హక్కులను కూడా అక్కడ ఓటీటీ సంస్థలకు భారీ ధరకు విక్రయించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని టాక్.
రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్.. అమన అన్ని సినిమాల తరహాలోనే సామాజిక సందేశాన్ని.. కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి.. భారీ యాక్షన్ ఎపిసోడ్లతో గేమ్ ఛేంజర్ సినిమాను రూపొందించాడట. ఇక సినిమాలో డ్యూయెల్ రోల్లో.. తండ్రి ,కొడుకులుగా చరణ్ కనిపించనున్నాడు. కాగా కొడుకు పాత్రలో రాంచరణ్ ప్రభుత్వ అధికారిగా.. తండ్రి పాత్రలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే యువకుడిగా కనిపించనున్నారని టాక్. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో నటించారు. ఇక సంక్రాంతి బరిలో సినిమా రిలీజై ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.