ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజన దేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను.. షాకింగ్ సీక్రెట్స్ అంజనాదేవి ఆడియన్స్తో షేర్ చేసుకుంది. ఆమె పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ నాడు సినిమాల కోసం కష్టపడితే నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ బుధవారం తన ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడుతూ.. భగవంతుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం పవన్ కు కల్పించాడని.. ప్రజల కష్టం తీర్చాలని ఆయన తపన పడుతున్నాడు అంటూ వెల్లడించింది. మొదటి నుంచి పట్టుపరుపులు చూడడన్ని.. నేల మీద పడుకునేవాడు అంటూ ఆమె గుర్తు చేసుకుంది.
చిన్నప్పటి నుంచి పవన్ ఎప్పుడు తనకు ఇది కావాలని అడిగే వ్యక్తి కాదు.. అందరూ భోజనాలు పూర్తయిన తర్వాత తను తినేవాడు.. నేను చేసిన పలావ్ మాత్రం చాలా ఇష్టంగా అయినా తినేవాడంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇది వండి పెట్టు, అది వండి పెట్టు అని ఎప్పుడూ అడగడని.. తినాలని చేసి పెడితే మాత్రం తప్పక తినేవాడు అంటూ వివరించింది. పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దీక్ష పట్టడం తనకు సంతోషాన్ని కలిగించిందని.. చిన్ననాటి నుంచే ఆయనకు కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ అంటూ వెల్లడించింది. ఇప్పటికే పవన్ అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్లొచ్చాడంటూ గుర్తు చేసుకుంది. అలా అని ప్రతిరోజు దండాలు పెట్టి పూజలు ఏమి చేయడు అంటూ వెల్లడించింది. ఇక అన్న ప్రసన్న టైంలో పవన్ కళ్యాణ్ కత్తి, పెన్ను పట్టుకున్నాడని అప్పుడే ప్రజలకు ఏదో ఒకటి చేస్తాడేమో అనిపించిందని చెప్పుకొచ్చింది.
పవన్ తన తండ్రిలా మితభాషి. అందుకే తండ్రికి కూడా పవన్ అంటే చాలా ఇష్టం అంటూ వెల్లడించింది. ఇద్దరికీ మొండి పట్టుదల ఎక్కువ అని మొదటి నుంచి అనుకున్నది సాధించే తీరుతారని.. చిన్నప్పటి నుంచి పవన్ కి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. హై స్కూల్ టైం నుంచి ఇప్పటివరకు కూడా పుస్తకాలు ఆయన ఎక్కువ చదువుతూ ఉంటాడని.. అతనికి ఈ సమాజంపై అంతా ఆలోచన రావడానికి కూడా అదే కారణమేమో అంటూ చెప్పుకొచ్చింది. చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ని బాగా చూసుకునేవాడని.. ఇప్పటికి పవన్ వదిన చాటు బిడ్డే అంటూ వెల్లడించింది. భర్తకు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ ఉండడంతో.. చెన్నైలో చిరంజీవి దగ్గర పవన్ ఉండేవాడు అంటూ చెప్పుకొచ్చింది. మొదట శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టాం. కానీ.. తర్వాత పవన్ కళ్యాణ్ గా పేరు మార్చారు అంటూ వెల్లడించింది.
మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఆలోచన విధానం మరింత బాగుందంటూ వెల్లడించింది. తన బిడ్డ ప్రజలకు సేవ చేయడం మంచి చేయడం ఆనందాన్ని కలిగిస్తుందని.. కొంతమంది బాధలు వినీ ఎంతో ఆవేదనకు గురైన సందర్భాలు ఉన్నాయని.. మొదటి నుంచి పవన్కు సహాయం చేసే గుణం ఎక్కువ.. ఎవరికైనా తన కళ్ళఎదురుగా ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తాడు. ఆదుకుంటాడు అంటూ వెల్లడించింది. ఇక డిప్యూటీ సీఎం అవుతాడని నేను ఊహించలేదు. అలాగే దేవుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది.. ఆ విధంగానే అతని ఎదుగుతాడు. గతంలో తనను పోలీసులు అడ్డుకున్నప్పుడు రోడ్డుపై పడుకున్న తీరు చాలా బాధ కలిగించింది. ఇంత అవసరమా వీడికి, ఎందుకు ఈ కష్టాలు అనుకున్నానని.. ప్రజల కోసం కష్టపడి ముందుకు నడిచిన పవన్ కళ్యాణ్ కు దేవుడు మంచి బాధ్యత అప్పగించాడు అంటూ వెల్లడించింది.